అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు













*అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ సూచన మేరకు ఘనంగా జరిగాయి*.. 

*వేడుకలలో పాల్గొన్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శైలజ,జిల్లా మహిళ అధ్యక్షురాలు విజిత,స్టేట్ జనరల్ సెక్రటరీ స్వప్న,కార్పొరేటర్లు నిర్మలకుమారి,ప్రవల్ల్లిక,రహేనా మరయు  మహిళా నాయకులతో కలిసి మాజీ ముఖ్యమంత్రివర్యులు వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వారు కేకు కట్ చేసి జోహార్ వైయస్సార్, జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు*.. 

*మేయర్ రాయన బాగ్యలక్ష్మి కామెంట్స్* 


వైసిపి హయాంలో మహిళలందరూ ఎంతో ఆనందంగా ఉంటూ అన్ని రంగాల్లో ముందుకెళ్లే వారిని నేడు ఆ పరిస్థితి లేదన్నారు.. 


మహిళలను ప్రోత్సహిస్తూ అనేక పథకాలు జగన్ అమలు చేశారని చెప్పారు.. ప్రతి మహిళా లక్షాధికారి అవ్వాలి అనే వైయస్సార్ ఆశయాలను జగన్ ముందుకు తీసుకు వెళ్లారని తెలియజేశారు.. 



మహిళలు విద్యావంతురాలు అవ్వాలని విద్యలో కూడా ముందుండాలనే లక్ష్యంతో పనిచేశారని చెప్పారు..



మహిళలకు ఉన్నత పదవులు ఇస్తూ రాజకీయాలలో కూడా రాణించాలని అండగా ఉన్నారన్నారు అన్నారు...



మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తూ 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత వైసిపి అధినేత జగన్ సొంతమని మేయర్ రాయణ భాగ్యలక్ష్మి అన్నారు..



అభివృద్ధి,సంక్షేమంలో కూడా మహిళలను భాగస్వామ్యం చేశారని చెప్పారు... వైఎస్ఆర్ ఆశయాలను జగన్ అమలు చేశారనీ తెలిపారు..



*డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ కామెంట్స్*


మహిళా పక్షపాతి ప్రభుత్వంగా జగన్ పాలనా చేశారన్నారు..


మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి పదవులు ఇచ్చారని చెప్పారు..


మహిళలు స్తిరపడటానకి ఎంతో సహాయం చేశారని గుర్తు చేశారు..


నేడు కూటమి ప్రభుత్వం మహిళలను నిర్లక్ష్యం చేస్తుందని చెప్పారు..


కూటమి ప్రభుత్వం మహిళల్ని పట్టించుకోవటం లేదని రాబోయే రోజుల్లో జగన్ నీ మళ్ళీ గెలిపించడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారని అన్నారు...


వేడుకలలో భాగంగా పలు రంగాల్లో రాణించిన మహిళలకు శాలువాలు కప్పి సన్మానం చేశారు



*డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ కామెంట్స్*


కూటమి హయంలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు..


మహిళలను తొక్కివేసే విధంగా కూటమి ప్రభుత్వం పాలన ఉందన్నారు..



ఆర్థికంగా అభివృద్ధి చెందే పథకాలు అమలు చేయాలని కోరారు..


మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని వారికి సరైన ప్రోత్సాహం ఇవ్వాలన్నారు...