Posts

Featured Post

విద్యార్థుల ప్రతిభకు వేదికగా నారాయణ స్కూల్ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్

Image
 విద్యార్థుల ప్రతిభకు వేదికగా నారాయణ స్కూల్ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ చిలకలూరిపేట, మార్చి 5, న్యూస్ 9 చిలకలూరిపేటలోని Narayana School బ్రాంచ్‌లో నిర్వహించిన స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ విద్యా ప్రగతి, ప్రతిభను తల్లిదండ్రుల ముందు ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా AGM వై. లక్ష్మణ్ రెడ్డి, ZCO గౌసియా హాజరై విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు తమ ప్రాజెక్టులు, అసైన్‌మెంట్లు, మోడల్స్ మరియు వివిధ క్రియేటివ్ వర్క్‌లను స్వయంగా వివరించి తల్లిదండ్రులకు తమ అభ్యాస స్థాయిని తెలియజేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ శేషగిరిరావు అధ్యక్షత వహించి స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ప్రాముఖ్యతను వివరించారు. అలాగే వైస్ ప్రిన్సిపాల్ నాగవర్ధని పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని తెలిపారు.కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు విద్యా...

గిన్నెస్ రికార్డ్ సృష్టించిన NBEMS: AI హెల్త్‌కేర్‌లో ప్రపంచ రికార్డ్!....

Image
 *గిన్నెస్ రికార్డ్ సృష్టించిన NBEMS:*  AI హెల్త్‌కేర్‌లో ప్రపంచ రికార్డ్!.... డాక్టర్ కొమ్మినేనికి అభినందనలు. వైద్య విద్యా రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) అరుదైన ఘనతన వైద్య విద్యా రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) అరుదైన ఘనతను సాధించింది. "హెల్త్‌కేర్‌లో కృత్రిమ మేధస్సు (AI in Healthcare)" అనే అంశంపై నిర్వహించిన యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ క్లాసులకు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో వీక్షకులు హాజరైనందుకు గాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లభించింది. ఈ చారిత్రక ఘట్టంలో చురుగ్గా పాల్గొన్న వీర శంకరరావు కొమ్మినేని కి NBEMS ప్రత్యేక అభినందనలు తెలియజేసింది. వైద్య విద్యార్థులు మరియు నిపుణుల అచంచలమైన మద్దతు వల్లే ఈ విజయం సాధ్యమైందని బోర్డు పేర్కొంది.  ప్రపంచ రికార్డ్ ఆరోగ్యరంగంలో ఏఐ వినియోగంపై నిర్వహించిన ఆన్‌లైన్ తరగతులకు రికార్డ్ స్థాయిలో స్పందన లభించింది.  దేశానికి గర్వకారణం: ఈ విజయం కేవలం NBEMS ఘనత మాత్రమే కాకుండా, వైద్య రంగంలో సాంకేతికత పట్ల భార...

ఎంపీ కేశినేని శివనాద్ గారి చేతుల్లో ఉన్న పట్టు వస్త్రాలను లాక్కున్న ఎమ్మెల్యే కొలికిపూడి

Image
 *తిరువూరు*  *ఘనంగా నెమలి వేణుగోపాల స్వామి మహోత్సవాలు* నెమలి స్వామి వారి కల్యాణోత్సవంలో ఎంపీ కేశినేని శివనాద్ గారి చేతుల్లో ఉన్న పట్టు వస్త్రాలను లాక్కున్న ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వీడియో క్లిపింగ్ *కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) దంపతులు* *కళ్యాణోత్సవానికి హాజరైన ఎంపీ కేశినేని చిన్ని దంపతులకు ఘనస్వాగతం పలికిన ఆలయ పాలకమండలి, అధికారులు *భక్తుల మధ్య కూర్చొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వ‌హించిన  ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు*   *ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మీడియా కామెంట్స్:* *నెమలి ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, మరింత అభివృద్ధి చెందాలని,ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేణుగోపాలస్వామిని వేడుకున్నా*  *నెమలి వేణుగోపాలస్వామి ఆలయాన్ని మరింత గా ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా*  *రానున్న కాలంలో ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు మరింత మెరుగయ్యేందుకు ఉత్సవాలు ముగిసిన అనంతరం అధికారులతో చర్చిస్తాం* *మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నెమలి వేణుగోపాల స్వామి వారి మహోత్సవాలు జరిగాయి* *కళ్యాణోత్సవం ఎంతో ఘనంగా జరిగింది...

ఫోను పే లతో వ్యాపారస్తులను భయాందోళనలకు గురి చేస్తున్న సైబర్ మోసగాళ్లు

Image
 *ఫోను పే లతో వ్యాపారస్తులను భయాందోళనలకు గురి చేస్తున్న సైబర్ మోసగాళ్లు*  చిలకలూరిపేట పట్టణంలో కొత్త రకం మోసాలకు తెరలేపుతున్న సైబర్ మోసగాళ్లు  పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం చిలకలూరిపేట పట్టణం మెయిన్ బజార్లో గత రెండు రోజులుగా సైబర్ మోసగాళ్లు తిరుగుతున్నారు ప్రజలు  వ్యాపారస్తులు అందరు కూడా ఈ విషయాన్ని గమనించి ఎవరు మోసపోవద్దని విజ్ఞప్తి అమాయకులైన షాపులకు వెళ్లి షాపు వాళ్ళని మోసళ్లు చేస్తున్న సైబర్ మోసగాళ్లు, మా వద్ద స్కానర్ పనిచేయడం లేదు నెంబర్ చెప్పండి నెంబర్ కి పంపిస్తాము అని ఎవరైనా అంటే ఎవరు మోసపోవద్దు,కొత్త రకం మోసాలు మా ఫోనుకి స్కానర్ పనిచేయట్లేదు నెంబర్ చెప్పండి అని పేటీఎం చేశాము అని వ్యాపారస్తులు దగ్గర సరుకులు ప్లస్, డబ్బులు కూడా తీసుకొని కూడా తీసుకొని ఉఢయించే బ్యాచి చిలకలూరిపేట పట్టణంలో తిరుగుతున్నారు జాగ్రత్త (అమాయకులు)  ఉన్న షాప్ లే ఎంపిక చిలకలూరిపేట ప్రజలు వ్యాపారస్తులు అందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాం

మాజీ MLC ఐలాపురం వెంకయ్య 92 నిన్న మరణించారు

Image
 News9  రిపోర్టర్. విజయవాడ  సెంట్రల్ యన్ టి ఆర్ జిల్లా  *ప్రముఖ  పారిశ్రామికవేత్త , ఐలాపురం  హోటల్  అధినేత మాజీ   MLC  ఐలాపురం వెంకయ్య 92 నిన్న మరణించారు  *వారి  పార్థివ దేహం  ఇంటి వద్ద నుంచి బయలుదేరి ఐలాపురం హోటల్, అక్కడి నుండి ఏలూరు రోడ్డు శ్రీ రామ మందిరం మీదుగా కృష్ణ లంక  లోని స్మశాన వాటిక వద్దకు తరలిoచారు

కోటప్పకొండ మహాశివరాత్రి తిరుణాళ్ళు

Image
 *కోటప్పకొండ మహాశివరాత్రి  తిరుణాల సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల... జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తారు.  దర్శనం టికెట్లు ఆన్లైన్ లో లేదా గుడి వద్ద ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉంటాయి. మహా శివరాత్రి రోజు లక్షన్నరమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము. ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె వివరించారు.

ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా

Image
 *విజయవాడ ఎన్టీఆర్ జిల్లా*  ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా *ఎ విద్యాసాగర్* ప్రధాన కార్యదర్శిగా *డివి రమణ* ప్యానెల్ నామినేషన్ కార్యక్రమం  *ఏ విద్యాసాగర్ పాయింట్స్* రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ  పెన్షనర్ల సంక్షేమమే లక్ష్యంగా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ పనిచేస్తుంది అసోసియేషన్ నామినేషన్ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా పదివేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు  ఉద్యోగుల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా మా ప్యానల్ పనిచేస్తుంది  ప్రభుత్వాలతో పోరాడి ఇప్పటికే ఉద్యోగుల ఎన్నో సమస్యలు తీర్చాము  ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ఐ ఆర్ డి ఏ ల సమస్య తీర్చేందుకు కృషి చేస్తాము  ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వాలకు తెలిపాం  తమ ప్యానెల్ ఓటు వేసి మరల అధ్యక్ష హోదా కల్పించాలని ఉద్యోగాలను కోరుతున్నాం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల తీర్చేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని మాట ఇస్తున్నాం  *కృష్ణ జిల్లా అవనిగడ్డ      నియోజకవర్గం*   *పీవీ మాధదేంద్ర రావు* ```  ప్రెసిడెంట్ ఏపీ ఎన్జీవో చల్లపల్లి యూనిట్  ఏపీ ఎన్...

విజయవాడలో 'అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్' ఘన ప్రారంభం

Image
 **ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ*: **విజయవాడలో 'అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్' ఘన ప్రారంభం*: **చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు భరోసా*: తెలుగు రాష్ట్రాల్లో చిన్నారుల పునరావాస రంగంలో అగ్రగామిగా ఉన్న 'అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్' (అశోక రిహాబ్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్) తన నూతన శాఖను విజయవాడలో ఘనంగా ప్రారంభించింది.  **అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ను డాక్టర్ సచిన్ కుమార్ గుల్వే,డాక్టర్ రాహుల్ గుల్వే  నవిత రాహుల్ గుల్వే, కిరణ్ కుమార్ గుల్వే ప్రారంభించారు*:. **నవిత రాహుల్ గుల్వే కామెంట్స్*: పిల్లలకు అనేక రకాల సమస్యలను నివారించడానికి ఈ సెంటర్ ఎంతగానో ఉపయోగ పడుతుంది హైదరాబాద్ లో సుమారు 15 బ్రాంచ్ లు ఉన్నాయి ఇpప్పటి నుంచి హైదరాబాద్ రాకుండా అదే ట్రీట్ మెంట్ విజయవాడలో అందిస్తాం **రాహుల్ గుల్వే కామెంట్స్*: అశోక చైల్డ్ లో అనేక థెరపీ లు కలవు  మీ పిల్లలకు మంచి భవిష్యత్ ఉంటుంది పిల్లలకు  ఎటువంటి సమస్య ఉన్నా వాటిని నయం చేయడం జరుగుతుందన్నారు **డా:సచిన్ కుమార్ గుల్వే కామెంట్స్*: ఆంధ్ర ప్రదేశ్ లో ఇది రెండోవ బ్రాంచ్  కొన్ని థెరఫీలో 3 రకాల వాటికి మాత్రమే చికిత్స ఉంటుంది  పిల్ల...

జేకే శ్రీవాస్తవ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ శ్రీకాకుళం జిల్లా మూలాపేట దగ్గర గ్రీన్ అమ్మోనియా తయారీ కోసం భారీ పరిశ్రమ

Image
 న్యూస్ 9ఛానల్ : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 3/2/2026 *ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, జేకే శ్రీవాస్తవ ఇన్ఫ్రా నడుమ ఎంవోయూ జరిగింది.  ఎంవోయూ పత్రాలపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్ ప్రేమక్కుమార్, కంపెనీ ఎండీ జేకే శ్రీవాస్తవలు సంతకాలు చేశారు* ప్రపంచ వ్యాప్తంగా హైడ్రోజన్ టెక్నాలజీకి విశేషమైన ప్రాధాన్యత పెరిగింది.  గ్రీన్ హైడ్రోజన్తో అమ్మోనియా తయారీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్నాయి.  ఈ రంగంలో విరివిగా పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తోంది.  ఈ నేపథ్యంలో జేకే శ్రీవాస్తవ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ శ్రీకాకుళం జిల్లా మూలాపేట దగ్గర గ్రీన్ అమ్మోనియా తయారీ కోసం భారీ పరిశ్రమను స్థాపించాలని ముందుకొచ్చింది.  2025 జులై 18న ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు సమక్షంలో ఈ కంపెనీ పరిశ్రమ స్థాపనపై రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది.  సుమారు 300 ఎకరాల్లో రూ.35 వేల కోట్ల అంచనాతో భారీ గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి పరిశ్రమను స్థాపించాలని ప్రయత్నాలు ...

పేటలో కొండవీడు ఉత్సవాలకు ముందుగా 2k రన్.

Image
 *పేటలో కొండవీడు ఉత్సవాలకు ముందుగా 2k రన్.* కొండవీడు ఉత్సవాల ప్రారంభానికి భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 5న ఉదయం 7 గంటలకు ప్రీ-లాంచ్ మారదాన్/పబ్లిసిటీ రన్ (2కి.రన్) ఏర్పాటు చేస్తున్నారు.ఈ 2కి.రన్ చిలకలూరిపేట పట్టణంలోని స్థానికరైతు బజార్ నుంచి ప్రారంభమై చౌత్ర సెంటర్, కళామందిర్ సెంటర్, అడ్డరోడ్ సెంటర్ మీదుగా ఎన్ ఆర్ టి సెంటర్ వరకు సాగుతుంది.ఆసక్తి గలవారు చిలకలూరిపేట పురపాలకసంఘ కార్యాలయానికి ఫోన్ చేసి (9705359645) పేరు నమోదు చేసుకోవచ్చు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పట్టణ ప్రజలను మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు కోరారు.

గిరిజన రైతులకు బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేయాలి

Image
 న్యూస్9 : చిలకలూరిపేట *గిరిజన రైతులకు బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేయాలి*   *గిరిజన సంఘాల నాయకులు.*  పెదకూరపాడు నియోజకవర్గ బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం, మోర్జంపాడుకు చెందిన గిరిజన రైతులకు   ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు మంజూరు చేశారు.ఇటీవల జరిగిన జిల్లా సమీక్ష సమావేశాల్లో బ్యాంక్ అధికారులు రుణాలు మంజూరు చేస్తున్నామని చెప్పి బ్యాంకుల వద్దకు వెళుతుంటే రైతులకు మొండి చేయి చూపిస్తున్నారు.గిరిజన సంఘాల నాయకులు సోమవారం ఆరోపించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు నాయకులు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో మొత్తం సుమారుగా 3,000 మంది గిరిజన రైతుల పరిస్థితి ఆగమేగోచరంగా ఉందని, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న కనీసం సమాధానం చెప్పడం లేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు తక్షణమే రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక  కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాకు వినతి పత్రం అందజేశారు. సంబంధిత బ్యాంక్ అధికారులు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులను పిలిచి వివరాలతో ఫైల్ పెట్టాలని ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో గిరిజన స...

కొరత మరియు విభజన సమస్యల వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై పడుతున్న ప్రభావం

Image
 తేదీ: 27-01-2026 విజయనగరం జిల్లా  గౌరవనీయులైన మంత్రి వర్యులు, ఉన్నత విద్యా శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ​విషయం: JNTUGV విజయనగరం - అధ్యాపకుల కొరత మరియు విభజన సమస్యల వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై పడుతున్న ప్రభావం - నివారణ చర్యలకై విన్నపం. ​ఆర్యా, ​ఉత్తరాంధ్ర విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం JNTU విజయనగరం (JNTUGV)ను స్వతంత్ర విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేసింది. అయితే, ప్రస్తుత పరిపాలనాపరమైన మరియు అధ్యాపకుల విభజన సమస్యల వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ విషయంలో తమరి జోక్యాన్ని కోరుతూ ఈ క్రింది అంశాలను విన్నవించుకుంటున్నాము: ​1. ఉత్తరాంధ్ర విద్యార్థుల ప్రయోజనాలు: JNTU విజయనగరం ప్రధానంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఏకైక ప్రభుత్వ సాంకేతిక విశ్వవిద్యాలయం. ఇక్కడ నియమితులైన అధ్యాపకులు డిప్యుటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల, స్థానిక విద్యార్థులు నిపుణులైన బోధకుల సేవలను కోల్పోతున్నారు. ​2. అకడమిక్ ప్రమాణాలు మరియు ప్రాజెక్టులు: అధ్యాపకుల కేటాయింపులో స్పష్టత లేకపోవడం వల్ల పరిశోధనలు (Research), స్టూ...

పెరిగిపోతున్న మట్టి, ఇసుక ,అక్రమ రవాణా*

Image
 *అన్నమయ్య జిల్లా రాయచోటి పరిసర ప్రాంతాలలో రోజురోజుకు పెరిగిపోతున్న మట్టి, ఇసుక ,అక్రమ రవాణా*  *రాయచోటి పట్టణానికి చేరువలో ఉన్నటువంటి పెద్ద కాలవపల్లి యండపల్లి ఏరు వద్ద జెసిబి లు పెట్టి ట్రాక్టర్లతో మట్టిని అక్రమంగా తరలింపు*.... *ఎక్కడపడితే అక్కడ చెరువులు ఎక్కడ కనిపిస్తే అక్కడ జెసిబి లు పెట్టి మట్టి అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు*...... *జెసిబి కి కానీ ట్రాక్టర్లకు కానీ నెంబర్లను కనిపించకుండా నెంబర్ బోర్డులను తొలగించి ఎద్దేంచగా మట్టిని తరలిస్తున్నారు*......  *ఇదిలా ఉంటే మరోవైపు తమకేమీ పట్టనట్టు తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ శాఖ అధికారులు*.... *గతంలో కొంతమంది విలేకరులు మట్టి అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం ఇస్తే ఎమ్మార్వో గారు వచ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ఇప్పటికీ ఇంకా యధావిధిగా కొనసాగుతున్న అక్రమ రవాణాలు....*

ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో

Image
 ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మండల మరియు వార్డు స్థాయి సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఈ సమావేశాలకు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైకార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ బలోపేతం, రాబోయే కార్యాచరణపై విస్తృతంగా చర్చ జరగింది. ప్రజల నుంచి లభించిన స్పందనతోవైఎస్సార్‌సీపీ మరింత బలంగా ముందుకు సాగుతోందని నాయకులు తెలిపారు.

రిమ్మనపూడి గ్రామ అభివృద్ధిలో ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్న

Image
 *కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం* *రిమ్మనపూడి గ్రామ అభివృద్ధిలో ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్న (NATS) చైర్మన్ కంచర్ల నందకిషోర్*  రిమ్మనపూడి గ్రామ వాస్తవ్యులైన కంచర్ల నందకిషోర్ ( NATS) ఉత్తర అమెరికా తెలుగు సంఘం చైర్మన్ తన స్వగ్రామమైన రెమ్మనపూడి గ్రామాన్ని పరిశీలించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు నందకిషోర్ మాట్లాడుతూ నాకు అధ్యక్ష పదవి వచ్చిన కారణంగా మా రిమ్మనపూడి గ్రామ ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తపరిచారు నాకు సాదర స్వాగతం పలికారు రిమ్మన్నపూడి గ్రామ ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో రిమ్మనపూడి లో ఉన్న ప్రజల అవసరాలు తెలుసుకున్నాను  ఊరికి కావాల్సిన రోడ్లు ఎల్ఈడి బల్బులు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి నిర్మించాలని నిర్ణయించాము. రాబోయే రెండు మూడు సంవత్సరాల కాలంలో మా గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం మెగావైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను.  ముందు ముందు రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధికి కావలసిన సహాయ సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగాతెలియజేస్తున్నాను.  అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాల ప్రజలు అమెరికాలో స్థిరపడిన వారికి ఏటువంటి సహాయ సహకారాలు అయిన...

వినియోగదారుల హక్కులను ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి :

Image
 వినియోగదారుల హక్కులను ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి : మురికిపూడి ప్రసాద్  కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మండలంలోని బొప్పూడి గ్రామంలో  ఉన్న పూసల సుబ్బయ్య,గుంటు వెంకటప్పయ్య జిల్లా పరిషత్ హై స్కూల్ నందు గురువారం కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో వినియోగదారుల హక్కుల గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జాతీయ వినియోగదారుల దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం *డిజిటల్ న్యాయ పాలన ద్వారా సమర్థ సత్వర పరిష్కారం* అనే అంశం ను ఈ సంవత్సరం థీమ్ గా నిర్దేశించిందని, విద్యార్థులు అందరూ వినియోగదారుల హక్కుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, కన్జ్యూమర్ క్లబ్బుల ద్వారా విద్యార్థులకు 2019 వినియోగదారుల చట్టం గురించి తెలియజేయాలని కోరారు. ఏదైనా వస్తువును కొనుగోలు చేసే క్రమంలో తప్పకుండా బిల్లును తీసుకోవాలని, వస్తువు కొనుగోల ద్వారా మోసపోయి నట్లయితే వెంటనే నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ కు 1915 కు ఫోన్ చేసి సమస్యను తెలియపరచవచ్చునని, అత్యంత సులభంగా వాట్సాప్ ...

రోడ్ ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు,

Image
 🚨 రోడ్డుప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు చిలకలూరిపేట: చిలకలూరిపేట పేట నుంచి గుంటూరు–విజయవాడ ఫ్లై ఓవర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. బాపట్ల నుంచి ఒక ప్రేయర్ కార్యక్రమానికి హాజరై అక్కడ పోస్టర్లు అంటించి తిరిగి విజయవాడకు వెళ్తున్న సమయంలో, చిలకలూరిపేట బైపాస్ వద్ద నిద్రమత్తులో వాహనం డివైడర్‌ను ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న 108 అత్యవసర సిబ్బంది వెంటనే స్పందించి గాయపడిన యువకులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

విజయవాడ గ్రేటర్ కమ్మ సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి..

Image
 న్యూస్ నైన్ ఛానల్ 11/01/2026 కృష్ణాజిల్లా  *విజయవాడ గ్రేటర్ కమ్మ సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి..* *రాజ్యసభ సభ్యురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి..* నాకు మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం కల్పించారు.. మన అని, మన వాళ్ళు అందరూ ఇక్కడ ఉంటారని ఇక్కడకు వచ్చాము.. *అప్పుడు రాజకీయ పరిస్థితుల వల్ల ఆగ్రహంతో ఒక మాట అన్నాను..* *కొండపైన అమ్మ వారు.. కొండ కింద కమ్మ వారు..* *ఆ తల్లి ఆశీసులతో ఈ కులాన్ని కాపాడుకోవాలి..* ఈ అవకాశం నేను పోగొట్టుకోకూడదని ఇక్కడకు వచ్చాను.. నేను 13 సంవత్సరం నుండే ట్రాక్టర్ నడిపాను.. అన్నిట్లో నువ్వు సమానమే అని నా తల్లిదండ్రులు నన్ను పెంచారు.. నువ్వు ఆడపిల్లవు నువ్వు తగ్గు అని ఏనాడు చెప్పలేదు.. మన కులంలో మహిళలను ముందుకు తీసుక రండి.. *ఎక్కడ మనం తగ్గాల్సిన అవసరం లేదు..* అమరావతి రైతుల పోరాటం తో ఇక్కడ గవర్నమెంట్ మారెవరకు అందరూ సహకరించారు.. కరెంట్ లేకపోయిన కంఠం వినిపించాలి.. *అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కూడా మన కోసం వెతుకుతుండేవారు..* ఈ కులం లో పుట్టినందుకు నాకు ధైర్యం వచ్చింది.. *మనం ఆర్డినరీ పీపుల్ కాదు ఎక్స్ట్రార్డినరీ పీపుల్..* *అమ...

విజయవాడ పడమటలంక తొమ్మిదవ డివిజన్లో సంక్రాంతి ముగ్గులు పోటీలు

Image
 *ఎన్టీఆర్ జిల్లా  విజయవాడ* న్యూస్ నైన్ ఛానల్ 10/01/2026 విజయవాడ పడమటలంక తొమ్మిదవ డివిజన్లో సంక్రాంతి  ముగ్గులు పోటీలు ఘనంగా నిర్వహించిన  "ముకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ యాజమాన్యం,   ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు చెన్నిపాటి గాంధీ మాట్లాడుతూ మకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్  మన విజయవాడలోనే ఉంది  ఈ సంక్రాంతి సంబరాలను మకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ యాజమాన్యం స్వయంగా నిర్వహిస్తామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో పడమటలంక డివిజన్ చుట్టుపక్కల ప్రజలందరూ పాల్గొని ఘనవిజయం చేశారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న పడమటలంక ప్రజలందరూ కూడా ముకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ను ఒకసారి సందర్శించవలెనని తెలియజేస్తున్నాను అని అన్నారు.  మకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ డైరెక్టర్ చిట్టా విజయ్ అండ్ టీం మాట్లాడుతూ  పటమటలంక 9వ డివిజన్లో సంక్రాంతి సంబరాలు కార్యక్రమం నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది.  మకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థను 15 మంది కలిసి స్థాపించడం జరిగింది.  సుమారు 7500 స్క్వేర్ ఫీట్ తో షోరూమును ప్రారంభించాము. డైమండ్ క్యారెట్ ...

ప్రాపర్టీ షో ప్రారంభమైంది

Image
 న్యూస్ 9 ఛానెల్: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 9/01/2026 ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం బందర్ రోడ్డు ఏ కన్వెన్షన్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాపర్టీ షోలో పాల్గొన్న  ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్  ఫౌండర్ బర్ల రఘుబాబు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ చరిత్రలో నూతన వరవడిని సృష్టిస్తూ కస్టమర్ కోరే విధంగా,వారి కోరిక మేరకు మంచి లొకేషన్ లో వారికి తగిన విధంగా ప్లాట్స్ ను తక్కువ ధరకు అందిస్తున్నాము.ప్రాపర్టీ కొనే విషయంలో లేదా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే విషయంలో కచ్చితంగా ఒక మంచి ఎక్స్పర్ట్ యొక్క సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మోసపోకుండా మంచి రిటర్న్స్ పొందుతారని, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది చిన్న విషయం కాదని అది చాలా పెద్ద విషయం అన్నారు. మా టీం మీరు కోరిన విధంగా రియాల్టీని అర్థం చేసుకుని, వాస్తవాలను మీకు తెలియజేస్తూ, మీరు కోరిన విధంగా టైలర్ మే డే ప్రాపర్టీని అం...

ఆరేవాకలెక్షన్స్, ఆయేషా జువెలర్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి

Image
 *ఆరేవాకలెక్షన్స్, ఆయేషా జువెలర్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి* న్యూస్ 9 ఛానెల్: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం  9/01/2026 ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏ కన్వెన్షన్ ఎదురుగాఆరెవా కలెక్షన్స్, ఆయేషా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ను  ప్రారంభించిన విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. ఈ సందర్భంగా రాయన భాగ్యలక్ష్మి, నిర్వాహకులు సుకెన్ మాట్లాడుతూ  విజయవాడలో ఆరెవా కలెక్షన్ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది, ఈ జువెలరీ షోరూంలో బ్రైడల్ కలెక్షన్ తో పాటు 20 గ్రాములలో అనేక రకాల వెరైటీలు అందుబాటులో ఉన్నాయన్నారు. మేకింగ్ చార్జీలు తరుగు చాలా తక్కువగా ఉంటుందని, విజయవాడ ప్రజలు తప్పకుండా ఈ జెవెలరీ షోరూం కి వచ్చి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. మా దగ్గర కుందన్, నక్షీ, డైమండ్,జువెలరీ నీ మేము సొంతంగా తయారు చేస్తున్నామని, ఈ అరెవా కలెక్షన్ బ్రాండ్ ను మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాలో ప్రారంభించామని, ప్రస్తుతం విజయవాడలో మా జువెలరీ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగిందన్నారు. మా కస్టమర్ లకు డైరెక్ట్ గా హోల్ సేల్ రేట్లలో ఇవ్వాలన...

అంగన్వాడీ స్కూల్ భవనానికి 35 లక్షల సి ఎస్ ఆర్ ఫౌండేషన్

Image
 న్యూస్ 9 ఛానెల్  7/01/2026 *ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం* *అంగన్వాడీ స్కూల్ భవనానికి 35 లక్షల సి ఎస్ ఆర్ ఫౌండేషన్, నిధులతో నిర్మించుటకు ముందుకు వచ్చిన డైరెక్టర్ తోటకూర కిషన్ కుమార్* విజయవాడ,తూర్పు నియోజకవర్గం, 4వ డివిజన్ ఏపీ. ఐ ఐ సి కాలనీ రైతు బజార్ ఏరియాలో  అంగనవాడి స్కూల్ శంకుస్థాపన  కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ పాల్గొన్నారు. గద్దె రామ్మోహన్, చెరుకూరి మురళీ మాట్లాడుతూ ఈ విధంగా  తెలిపారు. రోడ్డు నిర్మాణంలో పోయిన అంగన్వాడీ భవనానికి 35 లక్షల సి ఎస్ ఆర్ ఫౌండేషన్, విఎంసి నిధులతో నిర్మించుటకు ముందుకు వచ్చిన  డైరెక్టర్ తోటకూర కిషన్ కుమార్. విద్యార్థిని విద్యార్థులకు సరికొత్త రూమ్స్ ఏర్పరిచేందుకు కాంట్రాక్టర్ చెరుకూరు మురళి 15 లక్షలతో  నిర్మిస్తానని ముందుకు రావడం జరిగింది సేవా కార్యక్రమాలు, సోషల్ యాక్టివిటీస్,కాంట్రాక్టర్ల లో మంచి అనుభవం కలిగిన చెరుకూరి మురళి ముందుకు రావటం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజ్ఞప్తి మేరకు అనేకమంది ముందుకు వచ్చి విద్యాలయాలు, హాస్పిటల్స్, రహదారులు అభివృద్ధి చేస్తున్నారు అని అన్...

నూతన సంవత్సరం వేళ మద్యం అమ్మకాలలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న బొబ్బిలి...దామోదర్.

Image
 06-01-2026 నూతన సంవత్సరం వేళ మద్యం అమ్మకాలలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న బొబ్బిలి...దామోదర్...               నూతన సంవత్సరం వేడుకల సందర్బంగా   విజయనగరం జిల్లాలో జరిగిన మద్యం అమ్మకాలలో అత్యధికంగా మద్యం అమ్మకం అయినది మన బొబ్బిలిలోనే అని లోక్ సత్తా నాయకుడు ఆకుల దామోదర రావు అన్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆనంద పడాలో లేక బాధ పడాలో తెలియని పరిస్థితి అని ఆయన అన్నారు. ఈ కొత్త సంవత్సరం వేళ మన రాష్ట్రంలో జరిగిన మద్యం అమ్మకాలను గమనిస్తే డిసెంబర్ 31 వ తేదీ ఒక్కరోజే దాదాపు 200 కోట్ల రూపాయల మద్యం మన మందు బాబులు తాగారని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. నూతన సంవత్సర వేడుకల కోసం సాధారణంగా మూడు రోజుల ముందు నుంచే డిపోల నుండి మద్యాన్ని దుకాణాలకు చేరవేస్తారు. ఈ సారి డిసెంబరు 29,30,31 తేదీలలో 542.89 కోట్ల విలువైన మద్యం దుకాణాలకు చేరితే, మొత్తం 6.75 లక్షల ఐఎమ్ఎల్ కేసులు, 2.94 లక్షల కేసుల బీరు వెళితే అందులో డిసెంబరు 31 ఒక్కరోజే 2.65 లక్షల ఐఎమ్ఎల్, 1.15 లక్షల బీరు కేసులు అమ్ముడయినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీని విలువ దాదాపు 200 కోట్లు ఉంటుందని అంచనా. ...

బ్యాంకు అకౌంట్ ఫ్రిడ్జ్ చేయడంపై వినియోగదారుల సంఘానికి బ్యాంకు ఖాతాదారు ఫిర్యాదు చిలకలూరిపేట

Image
 వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ కు ఫిర్యాదు చేస్తున్న బ్యాంకు ఖాతాదారు బ్యాంకు అకౌంట్ ఫ్రిడ్జ్ చేయడంపై  వినియోగదారుల సంఘానికి బ్యాంకు ఖాతాదారు ఫిర్యాదు  చిలకలూరిపేట  పట్టణానికి చెందిన శిఖాకొల్లి శ్రీనివాసరావు సుబ్బయ్య తోటలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. ఇటీవల కాలంలో తన భార్య పేరు మీద చీరాల రోడ్లో ఉన్న ఒక ప్రాపర్టీని విక్రయించడంతో ప్రాపర్టీ కొన్నటువంటి కొనుగోలుదారులు ఆ మొత్తాన్ని ఆయన భార్య అయిన రజనీకుమారి పేరిట ఆమె ఖాతా ఉన్న యాక్సిస్ బ్యాంకుకు ఆర్టిజిఎస్ చేశారు. అయితే కొంత కాలం తర్వాత ఆ డబ్బును డ్రా చేసుకునేందుకు వారిద్దరూ బ్యాంకుకు వెళ్ళగా బ్యాంకు ఖాతాను స్తంభింప చేసినట్టు బ్యాంకు మేనేజర్ వినియోగదారులకి తెలిపారు. బ్యాంకు మేనేజర్ ను సంప్రదించగా జీఎస్టీ డిపార్ట్మెంట్ కు మీరు 18 లక్షలు బకాయి ఉన్నట్టు, బకాయి చెల్లించని కారణంగా మీ ఖాతాను స్తంభింప చేయమని జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుంచి ఉత్తర్వులు వచ్చాయని అందు కారణంగా ఖాతాను స్తంభింప చేసినట్టు బ్యాంకు మేనేజర్ వారికి వివరణ ఇచ్చారు. కాగా వినియోగదారులు తెలంగాణ రాష్ట్రం ...