రాజేశ్వరి న్యూరో అండ్ ఆంకో సెంటర్ ప్రారంభోత్సవం
విజయవాడ పటమట లో నిర్మలా కాన్వెంట్ ఎదురుగా రాజేశ్వరి న్యూరో అండ్ ఆంకో సెంటర్ ప్రారంభోత్సవం న్యూస్ 9 ఛానల్: విజయవాడ నిర్మల కాన్వెంట్ రోడ్, నిర్మలా హై స్కూల్ ఎదురుగా రాజేశ్వరి న్యూరో అండ్ ఆంకో సెంటర్ ను ప్రారంభించిన మెదడు మరియు క్యాన్సర్ నిపుణులు డాక్టర్ శ్రవణ్ కుమార్ బోడేపూడి ఎంబిబిఎస్ ఎండి జనరల్ మెడిసిన్, బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ ఫిజీషియన్, డాక్టర్ రాజేశ్వరి దగ్గుమాటి ఎంబిబిఎస్ ఎండి జనరల్ మెడిసిన్,న్యూరోసోనాలజిస్ట్. ఈ సందర్భంగా డాక్టర్స్ రాజేశ్వరి దగ్గు మాటి, శ్రావణ్ కుమార్ బోడేపూడి మాట్లాడుతూ స్ట్రోక్ రాకుండా మనం గుండెను ఎలా కాపాడుకోవాలి, అది రాకుండా నివారణ మార్గాలు తెలుసుకోవాలి, స్ట్రోక్ అనేది మనం అతి త్వరగా రియాక్ట్ అవ్వాల్సిన జబ్బు అని,గత పది సంవత్సరాలుగా న్యూరాలజీ సర్వీస్ అందిస్తున్నానని, ప్రస్తుతం న్యూరాలజీ క్లినిక్ ప్రారంభించామని, మా దగ్గర పక్షవాతం, మూర్ఛవ్యాధి,తలనొప్పి, కళ్ళు తిరగడం,వణుకుడు,మతిమరుపు జబ్బులు ,మెదడు వ్యాపు వ్యాధి, న్యూరో వాస్కులర్ సమస్యలు, మల్టిపుల్ సర్వీసెస్,కంటి నరము జబ్బులు, వెన్నుపాము సమస్యలు, వెన్నుపూస అరుగుదల, న్యూరోపతిస్ మొదలుగు వాటికి మా దగ్గర చికిత...