వినియోగదారుల హక్కుల పరిరక్షణలో సేవ చేస్తున్న వారికి గుర్తింపు ఎక్కడ?
అవినీతికి అందలం.. సమాజ సేవకులకు దక్కని పురస్కారం పల్నాడు జిల్లా కలెక్టరేట్ లోఆగస్టు 15 వేడుకల్లో పురస్కారాల ఎంపికపై విమర్శలు జీతాలు తీసుకునే అధికారులకు సన్మానాలు.. స్వచ్ఛంద సేవకులకు గుర్తింపు కరవు పౌరసరఫరాల శాఖ మంత్రిచే అవార్డుల బహూకరణ.. అదే శాఖకు ఉత్తమ అధికారుల కొరతపై చర్చ వినియోగదారుల హక్కుల పరిరక్షణలో సేవ చేస్తున్న వారికి గుర్తింపు ఎక్కడ? ఎంపిక ప్రక్రియపై ఉన్నతాధికారులు సమీక్షించాలంటున్న ప్రజా సంఘాలు ఆర్టీఐ ఆక్టివిస్ట్ కుమార్ విమర్శలు నరసరావుపేట, ఆగస్టు 15.... 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ఉత్తమ సేవా పురస్కారాల ఎంపిక, పంపిణీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తూ నెలనెలా జీతాలు పొందుతున్న కొంతమంది అధికారులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్, గౌరవ పురస్కారాలు అందజేయగా.. ఎలాంటి గౌరవ వేతనం లేకుండా సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం సేవ చేస్తున్న సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులకు కనీస గుర్తింపు కూడా దక్కలేదని ఆర్టీఐ కన్స్యూమర్ ఆక్టివిస్ట్ కుమార్ తో సహా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స...