జేకే శ్రీవాస్తవ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ శ్రీకాకుళం జిల్లా మూలాపేట దగ్గర గ్రీన్ అమ్మోనియా తయారీ కోసం భారీ పరిశ్రమ
న్యూస్ 9ఛానల్ : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 3/2/2026 *ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, జేకే శ్రీవాస్తవ ఇన్ఫ్రా నడుమ ఎంవోయూ జరిగింది. ఎంవోయూ పత్రాలపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్ ప్రేమక్కుమార్, కంపెనీ ఎండీ జేకే శ్రీవాస్తవలు సంతకాలు చేశారు* ప్రపంచ వ్యాప్తంగా హైడ్రోజన్ టెక్నాలజీకి విశేషమైన ప్రాధాన్యత పెరిగింది. గ్రీన్ హైడ్రోజన్తో అమ్మోనియా తయారీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్నాయి. ఈ రంగంలో విరివిగా పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో జేకే శ్రీవాస్తవ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ శ్రీకాకుళం జిల్లా మూలాపేట దగ్గర గ్రీన్ అమ్మోనియా తయారీ కోసం భారీ పరిశ్రమను స్థాపించాలని ముందుకొచ్చింది. 2025 జులై 18న ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు సమక్షంలో ఈ కంపెనీ పరిశ్రమ స్థాపనపై రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. సుమారు 300 ఎకరాల్లో రూ.35 వేల కోట్ల అంచనాతో భారీ గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి పరిశ్రమను స్థాపించాలని ప్రయత్నాలు ...