వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం–2019పై ప్రతి ఒక్కరి కి పూర్తి అవగాహన
*వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం* ఆర్టీసీ డిఎం యద్దనపూడి వేణుబాబు ఆర్టీసీ బస్టాండ్లో కరపత్రాల పంపిణీ – ప్రయాణికులకు అవగాహన వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం–2019పై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని చిలకలూరిపేట ఆర్టీసీ డీఎం యద్దనపూడి వేణుబాబు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని వినియోగదారుల హక్కుల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ప్రయాణికులకు కరపత్రాలు పంపిణీ చేసి చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో వినియోగదారులేనని, మార్కెట్లో వస్తువులు కొనుగోలు చేయడం నుంచి ఆన్లైన్ షాపింగ్, ఈ-కామర్స్ సేవలు, రియల్ ఎస్టేట్ రంగంలో ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసే వారందరూ వినియోగదారుల హక్కుల చట్ట పరిధిలోకి వస్తారని వివరించారు. వస్తువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, వస్తువుల నాణ్యత, గ్యారెంటీ, వారంటీ వంటి అంశాలను పరిశీలించే హక్కు ప్రతి వినియోగదారునికి ఉందన్నారు. నాణ్యమైన వస్తువు లేదా సేవ పొందే హక్కుతో పాటు ...