లా డిగ్రీ లో గోల్డ్ మెడల్ సాధించిన దీపిక.

 లా డిగ్రీ లో గోల్డ్ మెడల్ సాధించిన దీపిక.






తండ్రి నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే,ప్రకృతి వనరుల అభివృద్ధి కి ,రక్షణకి తన ఇన్వెస్టిగేషన్ జర్నలిజం లో నిరంతరం జీవన పయనం...

మరి ఆ చిన్నారిన్మసులో ఇంకా చెరగనిముద్ర వేశాయి.. 


తను మరింత చేరువగా ప్రజలకు న్యాయం అందించాలి అనుకుంది.


తన లక్ష్యం నిర్ధారించుకుంది.అకుంఠిత దీక్షతో ముందుకు సాగింది ..

న్యాయ దేవత ఆస్థానంలో ప్రవేశానికి న్యాయ శాస్త్ర విజ్ఞానం సంపాదించి అధ్యయనంలో కలికితురాయి గాసరస్వతి రూపంలో  విద్యలో అత్యున్నత బంగారుపతకం సాధించి నిరూపించింది.

తాతినేని దీపిక.

సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి కేవలం విద్య తో మాత్రమే ఉద్ధరణ పొందవచ్చు అని తలచి నిరూపించింది.

మన కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ కు విజయవాడ లోని సిద్ధార్ధ న్యాయకళాశాలగోల్డెన్ జూబ్లీ ఉత్సవం మరియు కళాశాల 39వ వార్షికోత్సవo సందర్బంగా 2023-2024 లా డిగ్రీ అత్యధిక ప్రతిభ కనబరచి  యూనివర్సిటీ టాపర్ గా ఎంపికైన తాతినేని దీపిక కు ముఖ్య అతిధి గా విచ్చేసిన ఏపీ హై కోర్టు న్యాయ మూర్తి జస్టిస్ ఎన్ జయ సూర్య చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తో పాటు ప్రశంసా పత్రం అందజేసి అభినందించడం జరిగింది.