కాకాని ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో
*కాకాని ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడ బెంజ్ సర్కిల్ నందు చలివేంద్రం ఏర్పాటు*
*ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు అడ్డూరి
శ్రీరామ్*
విజయవాడ నడిబొడ్డున బెంజ్ సర్కిల్ నందు కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్ కాకాని తరుణ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు కాకాని వెంకటరత్నం కాంస్య విగ్రహం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంకు ముఖ్యఅతిథిగా ఎన్టీఆర్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి, మజ్జిగ పంపిణీ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాకాని వెంకటరత్నం గారి మనవడు కాకాని తరుణ్ కాకాని ఆశయా సాధన సమితి స్థాపించి గత కొంతకాలం నుంచి పేదవారికి పలు రకాలుగా సేవలందిస్తూ కాకాని ఆశయాలకు దగ్గరగా ఉంటూ సేవలందిస్తున్నారు అని కొనియాడారు..అనంతరం ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్యనేతలు,ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు దాహం తీర్చడం కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాల దాతలకు అడ్డూరి శ్రీరామ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
ట్రాఫిక్ సీఐ రవికుమార్, రాజు, బీజేపీ నాయకులు రమేష్ మాదాల, అవ్వారు బుల్లబ్బాయి, పైలా సురేష్ బాబు, జాస్తి సతీష్, విజయవాడ తూర్పు బీజేపీ మండల అధ్యక్షులు పవన్ కుమార్, సందీప్ యర్లి, కేఏఎస్ఎస్ సభ్యులు గుమ్మడి రామకృష్ణ, గోగినేని ధనశేఖర్ . చాలా మంది కాలినడక ప్రయాణికులు మరియు ఆటో రిక్షా ఆపరేటర్లు ఫౌండేషన్కి కృతజ్ఞతలు తెలిపారు మరియు కాకాని యొక్క మంచి పనులను గుర్తు చేసుకున్నారు