విజయవాడ
*సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి*
*కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించే దమ్ము YCP కి లేదు*
*నేరస్థులను, దౌర్జన్యం చేసిన వాళ్ళను జైలుకి వెళ్లి పరామర్శ చేసే జగన్ కి అసెంబ్లీ కి వెళ్లేందుకు మొహం చెల్లదు*
*అసెంబ్లీకి వెళ్ళని జగన్ కి, వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యల మీద మాట్లాడే నైతికత లేదు*
*ఎక్స్ వేదికగా చంద్రబాబు , జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వాఖ్యలు చేసిన APCC చీఫ్ *
*వైఎస్ షర్మిలా రెడ్డి*
APCC చీఫ్
- సీఎం చంద్రబాబు గారి సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్.
- పథకాల అమలు ఎప్పుడు అని అడిగితే 9 నెలల్లో 90 కారణాలు చెప్పారు.
- ఇప్పటికైనా ఇచ్చిన హామీలపై , సూపర్ సిక్స్ పథకాలపై ..
- మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వాన్ని..
- ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
- ఈనెల 28న ప్రవేశపెట్టే బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాలకు అగ్రభాగం నిధులు కేటాయించండి.
- అన్ని పథకాలను ఈ ఏడాది నుంచే అమలు చేయండి.
- ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకోండి.
- ఇక కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన YCPకి అసెంబ్లీకి వెళ్ళే దమ్ములేదు.
- జగన్ మోహన్ రెడ్డి గారికి నేరస్థులను, దౌర్జన్యం చేసిన వాళ్ళను..
- జైలుకెళ్లి పరామర్శించే సమయం ఉంటుంది కానీ..
- ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదు.
- ప్రెస్ మీట్ లు పెట్టీ పురాణం అంతా చెప్పే తీరిక దొరుకుతుంది కానీ…
- అసెంబ్లీలో పాలకపక్షాన్ని నిలదీసే ధైర్యం జగన్ గారికి లేదు.
- ప్రజలు 11 మందిని గెలిపిస్తే శాసనసభకు రాకుండా మారం చేసే వైసీపీ అధ్యక్షుడికి,
- పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజల మధ్య తిరిగే అర్హత లేదు.
- ప్రజల సమస్యల మీద మాట్లాడే నైతికత అసలే లేదు.
- వైసీపీ ఎమ్మెల్యేలు ఈ సారైనా అసెంబ్లీకి వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నాం.
- సభా వేదికగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి.
- ఈ సారి కూడా అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేయాలి.