తాను చనిపోతూ కూడా పలువురికి ప్రాణదానం చేసిన బుద్ధన.*
:
తను చనిపోతూ కూడా పలువురికి ప్రాణదానం చేసిన బుద్ధన కోటేశ్వరరావు (55) నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం నీలిపూడి గ్రామానికి చెందిన బుద్ధన కోటేశ్వరరావు (వయసు 55) ఈనెల 5వ తేదీన బంటుమిల్లి ఎంపీడీవో కార్యాలయం ముందు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా ఆదివారం రాత్రి కోటేశ్వరరావు కు బ్రెయిన్ డెడ్ కు గురయ్యారు. అయితే ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు బుద్ధన కోటేశ్వరరావు కు సంబంధించిన హార్ట్, కిడ్నీ, లివర్ లను సోమవారం విజయవాడలో ప్రాణదానం చేయనున్నారు. ఇలా తను చనిపోతూ కూడా మరి కొంతమందికి అవయవ దానం చేసి ప్రాణాలను నిలబేడుతున్న బుద్ధన కోటేశ్వరరావు నేటి సమాజానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆయన మృతి పట్ల నీలిపూడీ గ్రామం శోకసంద్రం అయింది . అలాగే బంటుమిల్లి కృత్తివెన్ను మండలాలలో పలువురు కోటేశ్వరరావు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.