*గుంటూరు మిర్చియార్డుకు మాజీ సీఎం జగన్*
- మిర్చి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న జగన్
- ఏపీలో రైతులు బతికే పరిస్థితి లేదు-వైఎస్ జగన్
- ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు
- ఏపీలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడు
- రైతుల కష్టాలను చంద్రబాబు పట్టించుకోవాలి
- లేదంటే రాబోయే రోజుల్లో రైతుల తరపున ఉద్యమం- వైఎస్ జగన్
AP: గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిర్చి రైతులను పరామర్శించేందుకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో వైసీపీ అధినేత జగన్ యార్డ్కు చేరుకున్నారు. జగన్ వస్తున్నారని తెలిసి భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు వచ్చారు. మిర్చి యార్డ్ మొత్తం ప్రజలతో కిక్కిరిసిపోయింది. అయితే జగన్ పర్యటన నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు చేయలేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు జగన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు.