*వంశీ ఫోన్లో కీలక ఆధారాలు?దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు...!*
ఆంద్రప్రదేశ్
టీడీపీ కేంద్ర కార్యాలయంలో పనిచేసిన సత్యవర్ధన్ను అపహరించి దాడి చేసిన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫోన్పై పోలీసులు దృష్టి సారించారు.
ఈ ఫోన్లో కీలకమైన ఆధారాలు లభించే అవకాశాలు ఉందని పోలీసులు భావిస్తున్నారు.
హైదరాబాద్లో అరెస్ట్ చేసే సమయంలో వంశీ ఫోన్ దొరకలేదు.
వ్యక్తిగత సహాయకుడి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు.
తాజాగా వంశీ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.