మక్కువ ప్రజాశక్తి జర్నలిస్ట్ పై తెలుగు దేశం నేత దాడి
కీ ఖండన
బాద్యుడిని అరెస్ట్ చెయ్యాలి..
.......
ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్
ఏలూరు,:
పార్వతీపురం మన్యం, మక్కువ మండల "ప్రజాశక్తి" విలేకరి మల్యాడ రామారావుపై ఆ మండల టిడిపి అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్ నాయుడు దాడి అన్యాయం
ప్రజాస్వామ్యం.. ఈ దాడిని
ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఎపి డబ్ల్యూ జె ఎఫ్ ) ఏలూరు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది.
ఈమేరకు కమిటీ
అధ్యక్షుడు ఎస్ డీ జబీర్, కార్యదర్శి..హరీష్,
జిల్లా కార్యదర్శి,
కె ఎస్ శంకర్రావు.సీనియర్ నాయకులు కె బాలసౌరి, జిల్లా ఉపాధ్యక్షులు గంగరాజు, నెట్ వర్క్ ఇంచార్జ్ ప్రసాద్ లు సోమవారం
ప్రకటన విడుదల జేశారు.
ఆదివారం ఉదయం స్థానిక ఏ- వెంకంపేట నుండి కాశీపట్నం వెళ్లే నూతన రహదారి వద్ద వేణుగోపాల్ నాయుడిని కలవడానికి వెళ్లిన విలేకరి రామారావుపై టిడిపి నేత బూతులు తిట్టడమే కాకుండా చేయి చేసుకున్నారు.
ఇటీవల ప్రజాశక్తి పత్రికలో ‘ఎన్నికల కోడ్ అధికారులకు పట్టదా ..?’ అనే శీర్షికన … మంత్రి సంధ్యారాణి ఫ్లెక్సీలతో ఉన్న ఫోటోతో వార్త వెలువడింది. దీంతో కక్ష పెట్టుకున్న వేణుగోపాల్ నాయుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ దాడికి పాల్పడ్డారు.
విలేకరి రామారావు పై భౌతిక దాడికి తెగబడ్డాడు.
షర్ట్ పట్టుకొని తలపై కొట్టాడు. ఇంకా దాడి చేస్తుండగా అక్కడ ఉన్న వ్యక్తులు అడ్డుకున్నారు. ‘
నీ అంతు చూస్తాను. నిన్ను ఇక్కడ చంపి పాతి పెడతానంటూ ఆగ్రహంతో విలేకరిపై విరుచుకుపడ్డాడు.
ఈ సంఘటన పై
పోలీసులకు ఫిర్యాదు
చేసిన చర్యలు తీసుకోలేదు. వెంటనే కేసు నమోదు చేసి వేణు గోపాల్ నాయుడు ని అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షం లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెపడతామని హెచ్చ రించారు.
తనపై గాని మండలంలోని తన పార్టీ నాయకులు, కార్యకర్తలపై గాని ఎలాంటి వార్తలు రాసినా ‘ నీ భార్య పిల్లలకు నువ్వు దక్కవు. నిన్ను చంపడం ఖాయం ‘ అంటూ బెదిరించాడు. దీంతో ఆదివారం మధ్యాహ్నం మక్కువ పోలీసు స్టేషన్లో వేణుగోపాల్ నాయుడుపై విలేకరి రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేణుగోపాల్ నాయుడు నుండి రక్షణ కల్పించాలని, దాడి చేసిన అతనిపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అధికార పార్టీ నాయకుల తప్పొప్పులను ప్రజలకు తెలియజేయడం ప్రజాస్వామ్యంలో పత్రికల ప్రధాన విధి. ఈ విధిని నిర్వహిస్తున్న విలేకరిపై దాడి చేయడం, ప్రజాస్వామ్యానికి,విరుద్ధమైన చర్య. దీనిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఖండిస్తుదన్నారు . తెలుగుదేశం నాయకుడు వేణుగోపాల్ నాయుడు పై తక్షణం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు . ఈ దాడికి ఎక్కడికక్కడ నిరసన తెలియజేయాల్సిందిగా ఏలూరు జిల్లా ఫెడరేషన్ కమిటీలను కోరదమైనది.