ఎన్టీఆర్ జిల్లా:
గంపలగూడెం మండలం అనుమ్మోలంకలో శ్రీ బాలాజీ పౌల్ట్రీఫామ్ లో వైరస్ కారణంగా 4వేల కోళ్లు మృతి..
గడిచిన రెండ్రోజుల్లో కలిపి మొత్తంగా 10వేల కోళ్లు మృత్యువాత..
పౌల్ట్రీ ఫారం వద్ద చనిపోయిన కోళ్ళను పరిశీలించిన గంపలగూడెం వెటర్నరీ వైద్యుడు జి.సాయికృష్ణ
వైరస్ తో చనిపోయిన ప్రాంతాల్లోని 10KM పరిధిలో చికెన్ షాపులు,కోళ్లు,గుడ్లను తినొద్దని ప్రజలకు సూచన..
మృత్యువాత చెందిన కోళ్లను టెస్టుల కొరకు ల్యాబ్ కు పంపనున్న అధికారులు..
18లక్షల ఖర్చుతో 15వేల కోడిపిల్లలను పౌల్ట్రీలో పెంచుతున్నాం - పౌల్ట్రీ ఫారం నిర్వాహకుడు అత్తునూరి కాంత రెడ్డి
ఇప్పటికే 10వేల కోళ్లు నిమిషాల వ్యవధిలో చనిపోతున్నాయి..
లక్షల్లో నష్టం వాటిల్లింది,మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి..