విద్యార్థులకు అండగా వైసిపి ‘పోరుబాట’
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వం పై పార్టీపరంగా పోరుబాటకు వైసిపి అధినేత జగన్ పిలుపునిచ్చారు.దీనిలో భాగంగా ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పై పోరుబాటకు వైసిపి సిద్ధమవుతోంది.ఫీజు రియింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు చేపట్టబోతోంది.పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ విద్యార్థులు,తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందించనుంది.