ఎల్.ఓ.సిలు అందజేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్

 ఎల్.ఓ.సిలు అందజేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు


ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, గొల్లపూడి, 28.01.2025.







మైలవరం నియోజకవర్గంలో  5 గురికి లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సి) కింద రూ.4.97 లక్షలు మంజూరయ్యాయి. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ఈ సాయాన్ని ఎల్.ఓ.సిల రూపంలో లబ్ధిదారులకు మంగళవారం అందజేశారు. వీటితోపాటు సీఎం చంద్రబాబు గారి సందేశ పత్రాలను కూడా లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి కోలుకున్న విధానం గురించి ఆరా తీశారు.  ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు గారికి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.