రైస్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం

 *ఏలూరు సిటీ,*

*రైస్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం,*

*డిప్యూటీ తాసిల్దార్ ప్రమోద్ 50,000 డిమాండ్,*

*50,000 ఇస్తే లేదా చావు నాకేంటి అంటూ అవహేళన*

 *ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో  పొందుతున్న జన్యావుల సుధాకర్ (నాని),*





 ఇక వివరాల్లోకొస్తే స్థానిక ఏలూరు పట్టణానికి చెందిన జన్యావుల సుధాకర్(నాని)అనే వ్యక్తి పినకడిమి గ్రామంలో 13 బస్తాలు *ఆరున్నర* క్వింటాల్ బియ్యం కొనుగోలు చేస్తుండగా డిప్యూటీ తాసిల్దార్ ప్రమోద్ అక్కడికి చేరి  తనకు 50 వేలు  ఇవ్వాలని డిమాండ్ చేశారు, 50,000 ఇస్తే కేసు ఉండదని , లేకపోతే నీ చావు నువ్వు చావని  అసభ్యకరంగా మాట్లాడడం వలన తాను మనస్థాపన చెందానని ఆత్మహత్యాయత్నం చేసుకున్నానని  దానికి పూర్తి కారణం డిప్యూటీ తాసిల్దార్ ప్రమోదనని, ఆ బస్తాలకు నా వ్యాన్కు ఎటువంటి సంబంధం లేకపోయిన కానీ కావాలని ఆ బస్తాలు నా వ్యాన్లో ఎక్కించి అన్యాయంగా కేసు నమోదు చేసారని తెలిపారు, ఈ సంఘటనపై ఉన్నతాధికారులు తగిన విచారణ చేసి న్యాయం చేయాలని జన్యావుల సుధాకర్ (నాని) కోరారు.