ఏపీ జిల్లా మరియు విశాఖలో జగనన్న హౌసింగ్ స్కీమ్ పై

 


ఏపీ జిల్లా మరియు విశాఖలో జగనన్న హౌసింగ్ స్కీమ్ పై పలు పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా పేదవాడు సొంత ఇల్లు కళ నెరవేరుతుందని 35 వేల రూపాయలు కూడా బ్యాంకుల్లో జమ చేశారు నెలలో పోయి సంవత్సరాలు గడిచిన నేటికీ దానికి మోక్షం రాలేదు. మరి ఈ ప్రభుత్వం జగనన్న ఇల్లు తమ కట్టిన 35 వేలకు న్యాయం చేస్తాదా లేదా అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా పేద ప్రజలు ఇల్లు ఒక కలగా ఏర్పాటు చేసుకోవాలని చివరకు మహిళలు మంగళ సూత్రాలు కూడా తాకట్టుపెట్టి 35 వేల రూపాయలు అప్పులు చేసి సొంత ఇల్లు వస్తదని ఆశతో సొంత ఇల్లు కలను నిజం చేసుకోవాలని ఇల్లు కోసం బ్యాంకులో కట్టిన సొమ్ముకు పరిస్థితి ఏంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై స్థానిక రాజకీయ నేతలు గాని మంత్రులు గాని ఒక స్పష్టమైన నిర్ణయం ఇవ్వకపోవడమే సరే కదా నిర్మాణంలో ఉన్న ఇల్లులు ఎప్పుడూ ఇస్తారు అని అసలు ఇల్లు వస్తదా రాదా అని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు కానీ నేటి వరకు అధిష్టానం ప్రభుత్వం పేదవాడి ఇంటి కోసం మాత్రం పెదవి ఇవ్వకపోవడం ఒక ఆవేదనంగా పేదవాడికి మిగులుతుంది ప్రభుత్వం ఈ విషయంపై ఒక స్పష్టమైన నిర్ణయం పత్రికాముఖంగా మీడియా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రకటన విడుదల చేయాలని కొండంత ఆశతో పేద మధ్యతరగతి వారు సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు.