ప్రజలకు మంచి జరిగేలా అధికారులు విధులు నిర్వహించాలి.






*ప్రజలకు మంచి జరిగేలా అధికారులు విధులు నిర్వహించాలి.* 


*జిల్లా అభివృద్ధిలో అధికారులు కీలక పాత్ర పోషించాలి.*  


*రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత*  


అనకాపల్లి,


అధికారులు ప్రజలకు మేలు జరిగేలా అన్ని శాఖల సమన్వయం తో  రాష్ట్రంలో శాంతి భద్రతలను మెరుగుపరచి ప్రజలకు మంచి పరి పాలనను ఈ ప్రభుత్వం అందిం చడం జరుగుతుందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో  మంత్రి  పాల్గొన్నారు ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం లో అదృశ్యం కేసులపై సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు గ్రామాలలో సమస్యలు ముఖ్యంగా

పంచాయతీరాజ్ రోడ్లు మరియు భవనాలు,ఇరిగేషన్ శాఖలో  ఉన్నాయని వాటిని పరిష్క రించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు ప్రభుత్వ విధి విధానా లకు అనుగుణంగా అధికారులు విధులు నిర్వహించవలసినదిగా మంత్రి కోరారు ముందుగా రాష్ట్ర హోం శాఖ మంత్రిగా నియమితు లైన వంగలపూడి అనిత ను జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి,జిల్లా ఎస్పీ కేవీ మురళికృష్ణ,జిల్లా అధికారులు సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,వివిధ కార్యా లయాల సిబ్బంది పాల్గొన్నారు 


జారీ: డిఐపిఆర్ఓ అనకాపల్లి