జగన్‌ నుంచి ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించండి: సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్‌

 జగన్‌ నుంచి ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించండి: సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్‌



హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి సీబీఐ కోర్టులో ప్రొటెక్షన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని..


రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. తన కుటుంబానికి ఏపీ సీఎం జగన్, ఆయన సతీమణి భారతి, అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆయన కుమారుడు చైతన్య రెడ్డి నుంచి ప్రాణ హాని ఉందని పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ తన కుటుంబానికి రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు ఎంపీ అవినాష్‌ బెయిల్‌ రద్దు చేయాలని దస్తగిరి హైకోర్టులో పిటిషన్‌ వేశారు..