అనకాపల్లి జిల్లా పోలీసు





 *అనకాపల్లి జిల్లా పోలీసు*


*జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్.,* గారి ఆదేశాలతో పోలీసు అధికారులు, సిబ్బంది ఫిబ్రవరి 11న మద్యం, ఇసుక, గంజాయి, కోడిపందాలు మరియు జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించి, రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంట్  కేసులు నమోదు చేశారు.


❇️కోడి పందాలు, జూదం తదితర లు అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు దాడులు నిర్వహించి మొత్తం 6 కేసులు నమోదు చేసి, 22 మంది నిందితులను అరెస్టు చేసి, రూ.52,750/- నగదు, 7 పందెం కోళ్లు, 8 ద్విచక్ర వాహనాలు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు.


❇️మద్యం సేవించి వాహనాలు నడిపిన 19మంది పై కేసులు నమోదు చేశారు.


❇️బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగించిన 34 మంది పై 

కేసులు నమోదు చేశారు.


❇️ఎం.వి.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 259 కేసులు నమోదు చేసి, ఈ-చలానా గా రూ.46,015/- లు విధించారు.


❇️ప్రజలకు దిశా🆘యాప్

పట్ల అవగాహన కల్పించి, 34 మందితో యాప్ డౌన్లోడ్ చేయించారు. 6,02,686 మంది తో యాప్ ను డౌన్లోడ్ చేయించగా, 2,13,789 మందితో రిజిస్ట్రేషన్ చేయించారు.


❇️జిల్లా పోలీసులు, సెబ్ అధికారులు దాడి చేసి, 32 కేసులు నమోదు చేసి, 30 మంది నిందితులను అదుపులోనికి తీసుకుని, 54 లీటర్ల అక్రమ మద్యం, 15 లీటర్ల నాటు సారా ను స్వాధీనం చేసుకుని, 760 లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేసిన పోలీసులు.


❇️ఎస్పీ గారి ఆదేశాలతో 

రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక గ్రామాలను, పోలింగు కేంద్రాలను సందర్శించాలని అధికారులను ఆదేశించారు.


*జిల్లా పోలీసు కార్యాలయం,*

*అనకాపల్లి.*