నగరమంతా ఆకస్మిక *నాకాబంధీ


విశాఖపట్నం సిటీ, 

తేదీ: 07-02-2024.


                               *రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్ & అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారి ఆదేశాలతో నగర జాయింట్ సి.పి  శ్రీ కే.ఫకీరప్ప ,ఐ.పీ.ఎస్.,గారి ఆధ్వర్యంలో నగరమంతా ఆకస్మిక *నాకాబంధీ





*  నిర్వహించారు.

                         గత రాత్రి నగర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో సుమారు *1200 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బంది 110 టీంలు గా ఏర్పడి* ఉన్నతాధికారుల పర్యవేక్షణలో  నిర్వహించిన ఈ *నాకాబంధీ* ప్రధాన ఉద్దేశం నగరంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా, ప్రశాంతమైన వాతారణంలో సార్వత్రిక ఎన్నికలు జరిగేలా, నగరమంతా జల్లెడ పడుతూ అక్రమ మద్యం, నగదు, ఇతర అసాంఘిక మరియు అనుమానిత వస్తువులను పూర్తిగా నివారించేలా ప్రతీ వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం.

                            గత రాత్రి నిర్వహించిన *నాకాబంధీ* లో అధికారులు మరియు సిబ్బంది గంజాయి రవాణా పై ప్రత్యేక దృష్టి సారిస్తూనే, సరైన ద్రువపత్రాలు లేని వాహనాలను, నగదు, బంగారం, వెండి, అక్రమ మద్యం, బియ్యం వంటి వాటిని సీజ్ చేసి తగు విచారణ చేపట్టడం జరుగుతుంది.

                       

✳️ నగరంలో మొత్తం 14,220 వాహనాలు తనిఖీ చేయగా, సరైన ధృవపత్రాలు లేని 663 వాహనాలు సీజ్ చేశారు.


✳️ పీనగాడి జంక్షన్ వద్ద ఒక వ్యక్తిని అరెస్టు చేసి, 10 కేజీల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం సీజ్ చేయడం జరిగినది.


✳️ శనివాడ జంక్షన్ వద్ద 14.47 కేజీల బంగారం మరియు 13.31 కేజీల వెండి స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణకు చర్యలు తీసుకోవడం జరిగినది.


✳️ రైల్వే స్టేషన్ సమీపంలో 4.5 లక్షల నగదు, ఆరు మద్యం సీసాలు మరియు మద్దిలపాలెం జంక్షన్ వద్ద 4.29 లక్షల నగదును  స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణకు చర్యలు తీసుకోవడం జరిగినది.


✳️ గోపాల పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో భగత్ సింగ్ నగర్ వద్ద ఒక వ్యక్తిని అరెస్టు చేసి, సుమారు 860 కేజీల(18 బస్తాలు) బియ్యం ను, ఒక ఆటోను సీజ్ చేయడం జరిగింది.


                    *సెబ్(SEB) వారు ప్రతీ రోజూ నిర్వహించే తనిఖీలలో భాగముగా 06/02/2023 న నగరమంతా ముమ్మర తనిఖీలు జరిపారు.*


✳️  NDPS Act నందు ఒక కేసు నమోదు చేసి ఒకరిని అరెస్టు చేసి 12 కే.జిల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.


✳️ పలు ప్రాంతాలలో అక్రమ మద్యం కలిగిన మొత్తం 08 మంది పై 08 కేసులు నమోదు చేసి 21.22 లీటర్ల అక్రమ మద్యం స్వాధీన పరుచుకున్నారు.


✳️ సరైన ద్రువ పత్రాలు లేకుండా 5,97000/- నగదు తరలిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ కు అప్పగించడం జరిగినది.


               తనిఖీల్లో సీజ్ చేసిన పై అన్నింటికీ తదుపరి విచారణ జరిపి , చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.


              రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా పెద్ద మొత్తం లో నగదు , బంగారం లేదా ఇతర విలువైన వస్తువులను తీసుకువెళుతున్నట్లయితే వాటితో పాటుగా తగు ధ్రువపత్రాలు జతగా తీసుకువెళ్లాలని , లేని యెడల వాటిని సీజ్ చేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కావునా పెద్దమొత్తంలో నగదు, బంగారంతో ప్రయాణిస్తున్నప్పుడు తగు ధ్రువ పత్రాలు కలిగి ఉంచుకోవాలని ప్రజలకు పోలీసు వారి విన్నపం.


                        ఎలక్షన్ల నేపథ్యంలో నగరంలో ఎటువంటి చట్టవిరుద్ధ రవాణాలు జరగకుండా కట్టడి చేసేందుకు, నగర పోలీసులు నిరంతరం శ్రమిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది, ప్రజలు మరియు నగర పౌరులూ ఎల్లవేళలా బాధ్యతగా వ్యవహరిస్తూ పోలీసులకు సహకరించాలని నగర పోలీసు శాఖ వారి విజ్ఞప్తి.


                      నగర పోలీసు శాఖ తరపున, 

                విశాఖపట్నం సిటీ.