ఆంధ్రప్రదేశ్ మీదుగా అమృత్ భారత్ రైలు



ఆంధ్ర ప్రదేశ్: రైల్వేశాఖ ప్రవేశపెట్టనున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు శనివారం నుంచి పట్టాలెక్కనున్నాయి. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్లోని మాల్దా - బెంగళూరుల మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు ఏపీలోని తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా ప్రయాణిస్తుంది.